Monday, October 29, 2012

విజయవాడలో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్ వైఫ్

విజయవాడలో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్ వైఫ్


Pawan S Wife Renu Desai Visited Kanaka Durga Temple

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైఫ్ రేణు దేశాయ్ శనివారం విజయవాడలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్య పరిచారు. కొంత కాలంగా పవన్‌తో విడిగా పూణెలో ఉంటున్న రేణుదేశాయ్ తన రెండు సంవత్సరాల కూతురుతో విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించి పూజలు చేసారు. తన ఫ్రెండ్ పెళ్లి నిమిత్తం రేణు ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ...ప్రస్తుతం యూరఫ్ లో హాలీడే గడుపుతున్నారు. కొంత కాలంగా పవన్-రేణు దేశాయ్ విడివిడిగా ఉంటుండటంతో పవన్ ఒంటరిగానే విదేశీ విహార యాత్రకు వెళ్లారు. ఏది ఏమైనా అభిమానులు మాత్రం మళ్లీ ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు.
పవర్ స్టార్ సినిమాల విషయానికొస్తే...విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే త్రివిక్రమ్ సినిమా షూటింగులో పాల్గొననున్నాడు. ఈచిత్రంలో పవన్ సరసన సమంత ఎంపికైనట్లు తెలుస్తోంది. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. వచ్చే నెల(నవంబర్‌)లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.
రామ్ చరణ్ తో ‘రచ్చ' చిత్రం చేసిన దర్శకుడు సంపత్ నందికి...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం దక్కిందనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. అంతలోనే టైటిల్ కూడా బయటకు వచ్చింది. ఈ చిత్రానికి ‘చోటా మేస్త్రీ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి

No comments:

Post a Comment