Monday, October 29, 2012

‘చోటా మేస్త్రీ’గా పవన్ కళ్యాణ్?


‘చోటా మేస్త్రీ’గా పవన్ కళ్యాణ్?


హైదరాబాద్ : రామ్ చరణ్ తో ‘రచ్చ' చిత్రం చేసిన దర్శకుడు సంపత్ నందికి...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం దక్కిందనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. అంతలోనే టైటిల్ కూడా బయటకు వచ్చింది. ఈ చిత్రానికి ‘చోటా మేస్త్రీ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
pawan sampath nandi movie chota me

ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి సంభందించిన వర్క్ స్టార్టైందని సంపత్ నందికి క్లోజ్ గా ఉండే వారు అంటున్నారు. అయితే పూర్తిగా ఓకే అయ్యేదాకా ప్రాజెక్టు వివరాలు బయిట పెట్టకూడదని సంపత్ ఎక్కడా ఈ మ్యాటర్ పై మాట్లాడటం లేదని,అందుకే మీడియాకు కూడా దొరకకుండా పూర్తిగా స్క్రిప్టుపై దృష్టి పెట్టాడని వినికిడి.
ఈ చిత్రాన్ని NTV ఛానెల్ సి.ఈ.ఓ గా చేస్తున్న శరత్ మరార్ ప్రొడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. చాలా కాలంగా పవన్ కళ్యాణ్, శరద్ మరార్ పమంచి స్నేహితులు కావటంతో ఈ అవకాశం శరత్ మరార్ కి ఇచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తో తాను చేయబోయే చిత్రం అనంతరం ఈ చిత్రం ఉంటుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విదేశాల్లో హాలిడే ట్రిప్ గడుపుతున్నారు. ఆయన తిరిగి వచ్చిన వెంటనే త్రివిక్రమ్ సినిమా షూటింగులో పాల్గొననున్నాడు. ఈచిత్రంలో పవన్ సరసన సమంత ఎంపికైనట్లు తెలుస్తోంది. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. వచ్చే నెల(నవంబర్‌)లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.

No comments:

Post a Comment